Monday, February 01, 2010

వైష్ణవి

విజయవాడ లో అపహరణ కి గురైన చిన్నారి హతం.అతి దారుణం గా....అత్యంత కిరాతకం గా..
మనుషుల రూపం లో రాక్షసులు కంటే దారుణమైన ప్రాణులు ఇలా పసి పిల్లల్ని చంపడమా?
రాజ్యాంగానికి 60 యేళ్ళు అని సంబరంగా రిపబ్లిక్ దినం జరుపుకుని ఆ రోజుకి జండా వందనం చేసేసి చేతులు దులిపేస్కుంటే సరిపోతుందా? ఇలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఎలా అయితే ప్రాణాలు తీసారో, అలానే వాళ్ళని కూడా అందరూ చూస్తుండగా చంపండి.ఇలాంటి కఠిన చర్యలు లేకే దేశం లో ఇలాంటి ఘోరాలు చేసేవాళ్ళకి ఎక్కడా భయం లేదేమో.భయం, పాపభీతి అనే మాటలు కూడ వీళ్ళకి తెలియవు.
ఇంకా ఏం చూడాల్సివస్తుంది? ఇదేనా మన భారత దేశం.
ఏవో విభేదాలుంతటే పిల్లల ప్రాణాలు తీసే వీళ్ళకి ఎన్ని దమ్ములున్నాయో తెలుస్తూనే ఉంది.రాజ్యాంగాన్ని మార్చి ఇలాంటి సంఘటనలు ఇక జరగకుండా చట్టాలు మార్చాలి అని ఏ బుద్ధి ఉన్న రాజకీయ నాయకుడికి కూడా అనిపించదా?
Wake up India.
Please amend the laws. Execute the killers.
Please save the future citizens.

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP